కరీంనగర్ : కరీంనగర్ పట్టణ కేంద్రంలో విషాదం నెలకొంది. ఓ 16 ఏండ్ల యువకుడు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్కు చెందిన ఓ కార్పొరేటర్ బిజ్గిర్ షరీఫ్ దర్గా వద్ద మంగళవారం కందూరు నిర్వహించారు. ఈ వేడుకకు కార్పొరేటర్ కుటుంబ సభ్యులు, మద్దతుదారులు హాజరయ్యారు.
విందు అనంతరం ఓ ఐదుగురు యువకులు కలిసి సమీపంలో ఉన్న చెరువులోకి ఈతకు వెళ్లారు. మహ్మద్ అనే యువకుడు నీటిలో మునిగిపోయాడు. దీంతో మిగతా వారు గ్రామ సర్పంచ్ రాచపల్లి సదయ్యకు సమాచారం అందించారు. సర్పంచ్ పోలీసులను అప్రమత్తం చేయడంతో చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.