న్యూఢిల్లీ: కరోనా బారిన పడిన పేషెంట్లు మందుల కంటే కూడా ఎక్కువగా పౌష్టికాహారంపై దృష్టి పెట్టాలని ఎన్నో రోజులుగా నిపుణులు చెబుతున్నారు. మెరుగైన రోగనిరోధక శక్తి ఈ వైరస్ను సమర్థంగా ఎదుర్కొంటుందని, అందువల్ల సరైన ఆహారం చాలా ముఖ్యమని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. తాజాగా భారత ప్రభుత్వం కూడా కొవిడ్ పేషెంట్లు తీసుకోవాల్సిన ఆహారంపై పలు సూచనలు చేసింది. ఈ మేరకు MyGovIndia ఓ ట్వీట్ చేసింది. అందులో ఏమున్నాయో ఒకసారి చూద్దాం.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్వేవ్ విజృంభిస్తున్న వేళ హాస్పిటల్స్ అవసరం రాకుండా ఇంట్లోనే ఉండి కోలుకునే వారి సంఖ్యను పెంచడానికి మెరుగైన ఆహారమే మార్గమని ప్రభుత్వం చెబుతోంది. సరైన ఆహారం తీసుకుంటే 80 నుంచి 85 శాతం పేషెంట్లు ఇంట్లోనే కోలుకుంటున్నట్లు స్పష్టం చేసింది.