అమరావతి : కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును బొలెరో వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టడంతో బైక్పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలతోపాటు కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. చెన్నూరు శివారులోని పెన్నా నది బ్రిడ్జిపై ఇవాళ సాయంత్రం ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులు చాపాడు మండలం నక్కల దిన్నె అనంతపురం గ్రామానికి చెందిన చెవ్వూరు మల్లేష్(45) వెంకట లక్షమ్మ(47) లావణ్య(10) గా పోలీసులు గుర్తించారు. చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో నివాసముండే తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వెంకటమ్మ తన భర్తకుమార్తెతో కలిసి బైక్పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.