షాద్నగర్, మార్చి 30 : కొవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో షాద్నగర్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ దవాఖాన హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 13 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. బూర్గుల, చించోడ్, కొందుర్గు, నందిగామ, కొత్తూరు, కేశంపేట ప్రాథమిక కేంద్రాలతో పాటు పీపీయూనిట్లో 198 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. ఇందులో కొత్తూరు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో 3, షాద్నగర్ పీపీయూనిట్ కేంద్రంలో 5కేసులు నమోదైనట్లు వివరించారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల ద్వారా 55 మందిని పరీక్షించగా 5 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. ఎలాంటి కరోనా లక్షణాలు ఉన్నా వెంటనే స్థానిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
తప్పనిసరిగా మాస్క్లు ధరించాలి ..
శంకర్పల్లి, మార్చి 30 : గ్రామాల్లో, మున్సిపాలిటీలో ప్రజలు తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించాలని మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి సూచించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ కరోనా మళ్లీ ప్రబలుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
అప్రమత్తంగా ఉండాలి ..
కొవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ సూచించారు. ఇందులో భాగంగానే మున్సిపాలిటీలోని ప్రభుత్వ దవాఖానలో మంగళవారం టీకా తీసుకున్న సందర్భంగా మాట్లాడారు. కరోనా నియంత్రణకు అందుబాటులోకి వచ్చిన టీకా సురక్షితమైందన్నారు. టీకాపై ఎలాంటి అపోహలు వద్దన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేసుకోవాలని సూచించారు. రాష్ట్ర సర్కార్ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ శ్రీనివాస్, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.