శంషాబాద్ రూరల్ : వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండడం కోసం పోలీసులు ముందస్తుగా రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుంటున్నారు. అందులో భాగంగా శంషాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 11 మంది రౌడీషీటర్లను సోమవారం శంషాబాద్ తాసిల్ధార్ జనర్థన్రావు ఎదుట హాజరుపరిచినట్లు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై సత్యకుమార్ తెలిపారు.
నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు ఆయా గ్రామాలలో ఎలాంటి గొడవలు జరగకుండా శాంతియుతంగా ఉత్సవాలు జరుపుకోవడం కోసం వారిని తాసిల్ధార్ ఎదుట హాజరుపరిచినట్లు చెప్పారు.