దొంగ అరెస్టు.. బైక్లు స్వాధీనం

హైదరాబాద్ : బైక్లు దొంగిలిస్తున్న వ్యక్తిని నగరంలోని వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ సిబ్బంది మంగళవారం అరెస్టు చేసింది. నిందితుడి వద్ద నుంచి రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలిలా ఉన్నాయి. మొహమ్మద్ ఖాన్ అలియాస్ మమ్ము(20). టోలిచౌకీ నివాసి. నానాల్నగర్లో టీ స్టాల్లో పనిచేస్తున్నాడు. ఖాన్ గంజాయికి బానిసయ్యాడు. గంజాయికి డబ్బులు సమకూర్చడం ఇబ్బందులు మారే పరిస్థితులు తలెత్తాయి. దీంతో క్రమంగా దొంగతనం వైపు మొగ్గుచూపాడు. బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేసిన బైక్స్ను దొంగిలించడం ప్రారంభించినట్లు టాస్క్ఫోర్స్ డీసీపీ పి. రాధాకృష్ణారావు తెలిపారు.
గడిచిన మూడు వారాల్లో లంగర్హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు బజాజ్ పల్సర్ బైక్లను దొంగిలించాడు. సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల రికార్డు ఆధారంగా పోలీసులు నిందితుడి గుర్తించారు. విచారణలో గంజాయి కోసం తానే బైక్లను దొంగిలించినట్లు అంగీకరించాడు. వ్యక్తితో పాటు బైక్లను లంగర్హౌజ్ పోలీసు స్టేషన్లో అప్పగించారు.
తాజావార్తలు
- చంపేస్తామంటూ హీరోయిన్కు బెదిరింపు కాల్స్..!
- అమెరికా అధ్యక్షుడు ఫాలో అవుతున్న ఆ ఏకైక సెలబ్రిటీ ఎవరో తెలుసా?
- బైడెన్కు ఆ "బిస్కెట్" ఇవ్వకుండానే వెళ్లిపోయిన ట్రంప్
- ఆర్మీ నకిలీ ఐడీకార్డులు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్
- ఎస్బీఐ పీఓ మెయిన్ అడ్మిట్ కార్డుల విడుదల
- కరోనా టీకా తీసుకున్న ఆశా వర్కర్కు అస్వస్థత
- క్లినిక్ బయట ఫొటోలకు పోజులిచ్చిన కోహ్లి, అనుష్క
- మీర్జాపూర్ టీంకు నోటీసులు.. అమెజాన్ ప్రైమ్కు మరిన్ని కష్టాలు..!
- కోబ్రా ఫోర్స్లోకి మహిళల్ని తీసుకుంటున్నాం..
- శాండల్వుడ్ డ్రగ్ కేసు.. నటి రాగిణి ద్వివేదికి బెయిల్