నల్లగొండ : బైక్ అదుపుతప్పి రోడ్డు వెంట ఆగివున్న లారీని ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి సమీపంలో నార్కట్పల్లి- అద్దంకి రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడిని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం ముత్యాలమ్మపాడు గ్రామానికి చెందిన కేతావత్ రవినాయక్ (26)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వాడపల్లి ఎస్ఐ తెలిపారు.