హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలో అతివేగానికి యువకుడు బలయ్యాడు. వేగంగా వెళ్తున్న పల్సర్ బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలో ప్రాణాలు కోల్పోయాడు. జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమ్మిగడ్డ సాకేత్ టవర్ వద్ద ఇవాళ ఈ దుర్ఘటన జరిగింది. మృతుడిని జవహార్ నగర్కు చెందిన బాచి (22)గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.