రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి రోడ్డు వెంట ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి(65)పై ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.