పట్నా : మద్యనిషేధం అమల్లో ఉన్న బిహార్లో మద్యం సేవించిన కానిస్టేబుల్ గురువారం సాయంత్రం మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన కతిహార్ జిల్లాలో కలకలం రేపింది. నిందితుడిని బిహార్లోని ఎస్సీ, ఎస్టీ పోలీస్ స్టేషన్లో పనిచేసే ఎస్హెచ్ఓ నిత్యానంద్ పాశ్వాన్గా గుర్తించారు.
తప్పతాగిన పాశ్వాన్ బంధువుల ఇంటి నుంచి తిరిగివెళుతున్న బాలిక వెంటపడి వేధింపులకు గురిచేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్ధానికులు నిందితుడిని పట్టుకుని చితకబాదారు. నిందితుడిని విడిచిపెట్టాలని అక్కడకు వచ్చిన పోలీస్ సిబ్బందిపైనా స్ధానికులు దాడిచేశారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుపై ఎస్హెచ్ఓను అరెస్ట్ చేశారు.
నిందితుడు పాశ్వాన్ బంధువుల ఇంటి నుంచి తిరిగివస్తున్న తన కుమార్తెను అడ్డగించి ఆమెను అభ్యంతరకరంగా తాకాడని, లైంగిక వేధింపులకు గురిచేశాడని బాలిక తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. నిందితుడిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.