మహాముత్తారం : అడవిలో అక్రమంగా నిల్వ చేసిన టేకు దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని మహదేవ్పూర్ కలప డిపోకు మంగళవారం తరలించారు. వివరాల్లోకి వెలితే.. పెగడపల్లి ఫారేస్ట్ రేంజర్ సుష్మరావ్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి సింగంపల్లి అటవీ ప్రాంతంలో అధికారులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో సమాచారం తెలుసుకున్న స్మగ్లర్లు టేకు దుంగలను అడవిలో డంఫ్ చేసి పరారయ్యారు. అధికారులు అడవీలో విడిచి వెళ్లిన టేకు దుంగలను స్వాదీనం చేసుకుని మహాదేవ్పూర్ కలప డిపోకు తరలించారు. పట్టుకున్న టేకు దుంగల విలువ దాదాపు రెండు లక్షల రూపాయలు వరకు ఉంటుందని ఎఫ్ఆర్వో తెలిపారు. కార్యక్రమంలో యత్నారం సెక్షన్ ఆఫీసర్ లక్ష్మణ్, బీట్ ఆఫీసర్లు రాజేందర్, అనిల్, శ్యామ్, నాగ సన్నిత్, బెస్ క్యాంపు సిబ్బంది తదితరులు ఉన్నారు.