ఉప్పల్/చర్లపల్లి/కాప్రా/రామంతాపూర్, జూలై 1: పచ్చదనం, పరిశుభ్రత లక్ష్యంగా పట్టణ ప్రగతి మహాయజ్ఞంలా ముందుకు సాగుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో గురువారం ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ అరుణకుమారీ, చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, హబ్సిగూడ కార్పొరేటర్ చేతన హరీశ్, రామంతాపూర్ కార్పొరేటర్ వాణితో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతో పట్టణ ప్రగతిని విజయవంతంగా పూర్తిచేస్తామన్నారు. పట్టణాల్లో పదిరోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. సమస్యల పరిష్కారానికి పట్టణ ప్రగతి ఉపయోగపడుతుందన్నారు. నియోజకవర్గంలోని కాలనీలు, బస్తీల్లో అభివృద్ధి పనులు చేస్తామని, సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ నాగేందర్, డీఈ నాగమణి, అధికారులు నరేశ్, సుదర్శన్, నేతలు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, గరిక సుధాకర్, పల్లె నర్సింగ్రావు, ఏదుల్ల కొండల్రెడ్డి, రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
నియోజకవర్గ పరిధిలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కుషాయిగూడలో స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, డిప్యూటీ కమిషనర్తో కలిసి పర్యటించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రభుదాస్, శాంతి సాయిజెన్శేఖర్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, సింగిరెడ్డి ధన్పాల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సీసీఎస్ ప్రతినిధి పద్మారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.