ములుగు : జిల్లాలోని తాడ్వాయి మండలంలోని నర్సాపురం(పీఏ)కు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పద్మ(35) కరోనాతో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. నర్సాపురానికి చెందిన పద్మ ఏటూరునాగారం మండలంలోని నార్త్జోన్ బానాజిబందంలో బీట్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. రెండు రోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో ర్యాపిడ్ టెస్టు చేయించుకోవడంతో పాజిటివ్గా తేలింది.
దీంతో వరంగల్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం పద్మ చనిపోయింది. మృతురాలి భర్త కానిస్టేబుల్గా పనిచేస్తుండగా ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
సూర్యాపేట జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం
స్వీయ నియంత్రణయే శ్రీరామ రక్ష : మంత్రి ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు
కరోనా సెకండ్ వేవ్ మోదీ సృష్టించిన విపత్తు: మమతాబెనర్జి