అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,982 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది. 91,070 నమూనాలను పరిశీలించగా.. ఈ కేసులు వెలుగు చూశాయని పేర్కొంది. వైరస్ ప్రభావంతో 27 మంది మృతి చెందారని చెప్పింది. తాజాగా 3,461 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారని పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,11,318కు పెరగ్గా.. ఇప్పటి వరకు 18,66,522 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మొత్తం 12,946 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం 31,850 మంది చికిత్స పొందుతున్నారని ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో చెప్పింది.