పాన్గల్, మార్చి 30 : మండలంలోని కదిరేపాడు, కేతేపల్లి, దవాజీపల్లి తదితర గ్రామాల్లో మంగవారం పోషణ పక్షోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో పోషణ్ పక్వాడ్లో భాగంగా తక్కువ ఖర్చుతో కూడిన పోషక ఆహారాన్ని చిన్నారులకు పంపిణీ చేశారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ సువర్ణ మాట్లాడుతూ బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు ప్రభుత్వం పంపిణీ చేసే పౌష్టికాహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా జీవించాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సుమలత, కవిత, ఉత్తరమ్మ, కృష్ణమ్మ పాల్గొన్నారు.
కనిమెట్టలో..
కొత్తకోట, మార్చి 30 : మండలంలోని కనిమెట్ట అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం పోషణ వారోత్సవాల కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పురుషులకు వంటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మయ్య మాట్లాడుతూ ఇంట్లో మహిళలకు పోషకమైన ఆహారం అందించడంలో పురుషుల పాత్ర ముఖ్యమన్నారు. అనంతరం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు తిరుమలేశ్వరీ, సువర్ణ, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
పెబ్బేరు మండలంలో..
పెబ్బేరు రూరల్, మార్చి 30 : పెబ్బేరు మండలం తోమాలపల్లె గ్రామంలో మంగళవారం పోషకాహారంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక అంగన్వాడీ కేంద్రంలో పురుషులకు వంటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ అరుణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ పోషకాహారం అవసరమన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లావణ్య, ఉపసర్పంచ్ నరేందర్రెడ్డి, అంగన్వాడీ కార్యకర్త విమల పాల్గొన్నారు.
వనపర్తి మండలంలో..
వనపర్తి రూరల్, మార్చి 30 : మండలంలోని పలు గ్రా మాల్లోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం జిల్లా ఐసీడీఎస్ ఆధ్యర్యంలో పురుషులకు పౌష్టికాహారంపై వం టల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజపేట, సవాయిగూడెం, కడుకుంట్ల, చిట్యాల, చిట్యాల పడమటితండాల అంగన్వాడీ కేంద్రాల్లో పురుషులకు వంట పోటీలను నిర్వహించినట్లు మండల సూపర్వైజర్ హజీరాబే గం తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచు లు, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.