కాచిగూడ : సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైల్లో ప్రయాణం చేస్తున్న ఆటోడ్రైవర్ అదృశ్యమయ్యాడు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం లంగర్హౌస్, సన్సిటీ ప్రాంతానికి చెందిన మహేశ్ భాగోరా కుమారుడు రాజు భాగవార్ (28) వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. నగరానికి రావడానికి భూపాల్ రైల్వేస్టేషన్లో ఈ నెల 14న సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్ రైలెక్కాడు.
ఇప్పటి వరకు రాజు భాగవార్ కాచిగూడ రైల్వేస్టేషన్కు రాకపోవడంతో కలత చెందిన కుటుంబ సభ్యులు బంధువుల, స్నేహితులను విచారించినా ఆచూకీ లభించకపోవడంతో గురువారం కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్లో ఆయన భార్య అంజిదాఖాన్ ఫిర్యాదు చేసింది.
భాగవార్ వెళ్లే సమయంలో పుసుపు రంగు చొక్క, నీలిరంగు ప్యాంట్ ధరించి, ఎత్తు 5.5 ఉన్నట్లు రైల్వేపోలీసులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ లక్ష్మణాచారి తెలిపారు.