కొడంగల్ : ఆటో బోల్తా పడి ముగ్గురికి గాయాలు కాగా బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని లక్ష్మిపల్లి గ్రామ స్టేజీ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సమ్యానాయక్ అందించిన వివరాల ప్రకారం.. నియోకవర్గంలోని బొంరాస్పేట మండలం తుంకిమెట్ల గ్రామానికి చెందిన అభిరాం(4) కుటుంబ సభ్యులతో కలిసి తాండూర్ మండలంలోని బషీరాబాద్ మండలం కంసాన్పల్లిలో జరిగిన దావత్కు వెళ్లారు. దావత్ ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంగా లక్ష్మిపల్లి గ్రామం మీదుగా ఆటోలో బయలుదేరారు.
ఈ క్రమంలో లక్ష్మిపల్లి గ్రామ స్టేజీ వద్ద ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న కిష్టయ్య, లక్ష్మి, నర్సింహులకు గాయాలు కాగా అభిరాం(4) సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఆటో బోల్తా సంఘటనలో గాయాలకు గురైన వారిని 108లో కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సంఘటనకు మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.