వెల్లింగ్టన్: బ్రిటన్ తర్వాత ఇప్పుడు న్యూజిలాండ్ ప్రభుత్వం.. చైనాకు వ్యతిరేకంగా గలమెత్తింది. చైనాలో ఉయ్గార్ ముస్లింలపై జరిగిన దారుణాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు. ఉయ్గార్లపై జరిగిన దారుణాలకు సంబంధించి న్యూజిలాండ్ ఏసీటీ పార్టీ ఈ ప్రతిపాదనను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ ప్రతిపాదనపై అన్ని పార్టీలు చర్చించాయి. అనంతరం అందరి సమ్మతితో ఈ ప్రతిపాదనను ఆమోదించారు.
రెండు రోజుల క్రితం ఆక్లాండ్లో జరిగిన చైనా బిజినెస్ మీట్లో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెర్న్ స్వరం పెంచారు. జిన్జియాంగ్లో మానవ హక్కుల ఉల్లంఘనపై చైనాపై నేరుగా విమర్శలు చేశారు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉయ్గార్పై జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడా వరుసలో న్యూజిలాండ్ చేరింది.
పశ్చిమ జిన్జియాంగ్లోని ఉయ్గార్ ముస్లిం జనాభా దోపిడీకి గురవుతున్న చైనా విధానాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ గత నెలలో బ్రిటిష్ చట్టసభ సభ్యులు పార్లమెంటరీ తీర్మానాన్ని ఆమోదించారు. యూఎస్, కెనడా వంటి దేశాలు జిన్జియాంగ్లో చైనా చర్యలను మారణహోమం అని పేర్కొన్నాయి.
బుద్గాంలో డీఆర్డీఓ 500 పడకల దవాఖాన
టీకా వృథా తగ్గేలా చేస్తున్న కేరళకు ప్రధాని ప్రశంసలు
భారత్లో అమెరికా కొత్త రాయబారిగా లాస్ ఏంజిల్స్ మేయర్..?
హర్యానాలో ప్రభుత్వ ఆజమాయిషీలో ప్రైవేట్ దవాఖానలు
ఓటమితో మమతకు సీఎంగా నైతిక హక్కు లేదు : త్రిపుర సీఎం బిప్లబ్
యాహూతో గూగుల్ను సవాల్ చేయాలని మైక్రోసాఫ్ట్ ప్లాన్..?!
ఫుట్పాత్పై రసరమ్య సంగీత బాణీలు.. చరిత్రలో ఈరోజు
ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకులు.. ఇవే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..