కొత్తూరు : మొబైల్ షాప్లో చోరీకి యత్నించిన సంఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. కొత్తూరు సీఐ భూపాల్ శ్రీధర్ కథనం ప్రకారం.. గుర్తు తెలియని ముగ్గురు దుండగులు కొత్తూరు పాత నేషనల్ హైవే పై ఉన్న హలో మొబైల్ షోరూంలో చోరీకి యత్నించారు. శుక్రవారం అర్ధరాత్రి సెల్ఫోన్ షోరూంలో షటర్ను ధ్వంసం చేసి లోపలికి వెళ్లే క్రమంలో గ్లాస్ ఫ్రేం బిగించి ఉంది. దాన్ని తీయడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. అయితే శబ్ధాలు వినపడటంతో షోరూంపై ఉన్నవారు మేల్కొన్నారు. దీంతో ఎవరూ అని అరవడంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారు.
ఈ సందర్భంగా సీఐ భూపాల్ శ్రీధర్ మాట్లాడుతూ దొంగలను సీసీ పుటేజీలో గుర్తించామని వారు ముగ్గురు ఉన్నారని తెలిపారు. వారు వరుసగా శనివారం తెల్లవారు జామున జడ్చర్ల, షాద్నగర్, అనంతరం కొత్తూరులో దొంగతనాలకు వచ్చారని వివరించారు. అయితే జడ్చర్ల, షాద్నగర్లో చోరీ జరిగిందని, కొత్తూరులో మాత్రం వారి ప్రయత్నం విఫలమైందన్నారు. మొబైల్ షాప్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నమన్నారు.