బంజారాహిల్స్ : మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో ఒకరు బాటిల్తో దాడి చేయడంతో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్కర్నూ ల్ జిల్లా గోపాల్పేట మండలం అల్లీపురం తండాకు చెందిన సత్యనారాయణ నాయక్ (65) అనే వ్యక్తి నగరానికి వచ్చి యాచకవృత్తిలో ఉన్నాడు. బుధవారం మద్యాహ్నం జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లోని వైన్షాపువద్ద మద్యం కొనుక్కున్న సత్యనారాయణ రోడ్డుపక్కన ఫుట్పాత్ మీద కూర్చుని మద్యం సేవిస్తున్నాడు.
అదే ప్రాంతంలో తిరుగుతుండే యాచకుడు వెంకటేష్ (32) మద్యం మత్తులో అతడివద్దకు వచ్చాడు. తనకు ఇంకా తాగాలని ఉందని, మద్యం కొనేందుకు డబ్బులివ్వాలంటూ డిమాండ్ చేశాడు. తనవద్ద డబ్బులేదని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో ఆగ్రహానికి లోనయిన వెంకటేష్ ఖాళీ బీర్ బాటిల్తో సత్యనారాయణపై దాడికి దిగడంతో మొఖం, మెడలపై గాయాలయ్యాయి.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడకు చేరుకుని బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు నిందితుడు వెంకటేష్పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.