సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): యూకేలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మించి యూసుఫ్గూడకు చెందిన వెంకటమురళి అనే యువకుడికి సైబర్నేరగాళ్లు రూ.13 లక్షలు టోకరా వేశారు. మురళి ఉద్యోగం కోసం ప్రయత్నంలో ఉండ గా యూకేలో ఉద్యోగమంటూ ఈ మెయిల్ వచ్చి ంది. మెయిల్ను చూసి స్పందించడంతో సైబర్ నేరగాళ్లు యూకేలో ఉద్యోగం ఇప్పిస్తామని, ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో సేల్స్ మేనేజర్గా ఉద్యోగం ఉందంటూ నమ్మకం కల్పించారు. ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలంటూ సూచించారు. వీసా కోసం బ్రిటన్ ఎంబసీ నుంచి అధికారులం అంటూ మాట్లాడారు. మీకు వీసా ఇస్తున్నామని నమ్మించారు. అనంతరం మీకు ఉద్యోగం కూడా వచ్చేసింది, ఆరు నెలలకు సంబంధించి 50 వేల పౌండ్లు మీకు అడ్వాన్స్గా ఇస్తున్నారంటూ సైబర్నేరగాళ్లు చెప్పారు. ఆయా ఖర్చు లు, ఫీజుల పేరుతో దఫ దఫాలుగా రూ.13 లక్షలు వసూలు చేశారు. ఇంకా డబ్బు అడుగుతుండటంతో, ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉన్నది.
అంబర్పేట్కు చెందిన శ్రీధర్ ఫోన్కు ఎఫ్క్యూ మార్కెట్ కరెన్సీ ట్రేడింగ్ పేరుతో మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి వివరాలు తెలుసుకోవడం కోసం ఫోన్ చేశాడు. తాము చెప్పినట్లు రూ.20 వేల డాలర్లు పెట్టుబడి పెడితే అత్యధిక లాభాలు వస్తాయంటూ నమ్మించారు. వాళ్ల మాటలు నమ్మిన శ్రీధర్ రూ.9.2 లక్షలు పెట్టుబడి అంటూ వాళ్లు చెప్పిన ఖాతాలో డిపాజిట్ చేశాడు. ఆ తరువాత అవతలి వ్యక్తులు ఫోన్లు స్విచాఫ్ చేయడంతో ఇదంతా మోసమని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.