కుమ్రంభీం ఆసీఫాబాద్ : జిల్లాలోని కాగజ్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు..వన్య ప్రాణుల కోసం ఓ రైతు పంట పొలాల్లో అమర్చిన వైర్లు తగిలి సత్తయ్య, దుర్గరాజు అనే వ్యక్తులు మృతి చెందారు. కాగా, భయంతో పొలం యజమాని మృతదేహాలను పూడ్చిపెట్టారు.
గ్రామస్తులు మృతదేహాలను వెలికితీసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Road accident |యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
నిందితుడు రాజు చేతులపై పచ్చబొట్టు ఎవరిదో తెలుసా?
నా చుట్టూ డజన్ల సంఖ్యలో కరోనా సోకినవాళ్లే ఉన్నారు: వ్లాదిమిర్ పుతిన్
Nusrat Jahan: ఎట్టకేలకు తన బిడ్డ తండ్రి ఎవరో చెప్పిన అందాల నటి