ఖమ్మం : మతి స్థిమితంలేని వ్యక్తి.. మద్యం మత్తులో తన తండ్రినే హత్య చేసిన సంఘటన ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అదే గ్రామానికి చెందిన కొలిచలం రామచంద్రయ్య (70)కు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు కొలిచలం ఉమాశంకర్ (33).. తన తల్లిదండ్రులైన లక్ష్మీదేవి, రామచంద్రయ్యలతో వారి ఇంట్లోనే కలిసి ఉంటున్నారు.
మంగళవారం అర్ధ రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన కుమారుడు ఉమాశంకర్కు, తండ్రి రామచంద్రయ్యకు మధ్య చిన్న ఘర్షణ చోటు చేసుకుంది. అయితే రాత్రి రామచంద్రయ్య, లక్ష్మీదేవి నిద్రిస్తున్న సమయంలో ఉమాశంకర్ ఒక్కసారిగా తండ్రిని మంచం మీద నుంచి కిందకు లాగి బోర్లా పడేసి అతడిపై కూర్చున్నాడు. రెండు చేతులూ వెనక్కు లాగి తండ్రి తలను రాయితో కొట్టి చంపి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మోడల్ స్కూళ్లు అధునాతన దేవాలయాలు
కార్మికులకు అండగా నిలిచిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
భూమికి బరువయ్యేంత పంట పండిస్తాం : మంత్రి హరీశ్ రావు
దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్ల పంపిణీ
ఎంపీ వెంకటేష్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత
ఐసోలేషన్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్