బంజారాహిల్స్ : ఇంటిముందు పార్క్ చేసిన స్కూటర్ చోరీ అయిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 5లోని దేవరకొండబస్తీలో నివాసం ఉంటున్న షిరీన్ ఫాతిమా ఓ ప్రైవేటు సంస్థలో సేల్స్గర్ల్గా పనిచేస్తోంది.
ఈనెల 18న సాయంత్రం తన ఇంటిముందు హోండా యాక్టివా స్కూటర్ (టీఎస్ 11ఏసీ టీఆర్6431) ను పార్క్ చేసింది. మరుసటిరోజు ఉదయం వచ్చి చూడగా స్కూటర్ కనిపించలేదు. దీంతో అన్ని ప్రాంతాలలో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.