హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైలార్దేవ్పల్లి వద్ద శనివారం అర్ధరాత్రి సిమెంట్ రెడీమిక్స్ లారీ ఓ బైక్ను ఢీకొట్టింది. దీంతో మోటారుసైకిల్పై వెళ్తున్న ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు పంపించారు. నిన్న రాత్రి 11.40 గంటల ప్రాంతంలో చాంద్రాయణగుట్ట నుంచి దుర్గానగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులను మహారాష్ట్రకు చెందిన కమ్రుద్దీన్, బబ్లూ, జమీల్గా గుర్తించారు.