హైదరాబాద్: మహమ్మారి మరోసారు విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా నిన్న 72,634 మందికి పరీక్షలు నిర్వహించగా.. 2157 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వైరస్ వల్ల కొత్తగా ఎనిమిది మంది మరణించగా, మరో 821 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,34,738కి చేరింది. ఇందులో 3,07,499 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడగా, మరో 1780 మంది మరణించారు. ఇంకా 25,459 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇందులో 16,892 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 361, మేడ్చల్ జిల్లాలో 245, రంగారెడ్డిలో 206 చొప్పున ఉన్నాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,12,53,374 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నది. రాష్ట్రంలో మొత్తం 23,12,340 మంది కరోనా టీకా తీసుకున్నారు. ఇందులో 20,10,611 మంది తొలి డోసు వేయించుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..