న్యూఢిల్లీ: తరగతిలో సరిగా కూర్చోమన్నందుకు ఒక విద్యార్థి ఇనుప రాడ్తో టీచర్పై దాడి చేశాడు. దీంతో ఆ ఉపాధ్యాయుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాన్హోలా ప్రాంతం బాప్రోలాలోని ప్రభుత్వ బాలుర సీనియర్ మాధ్యమిక పాఠశాలలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. 11వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి క్లాస్కు ఆటంకం కలిగిస్తున్నాడు. గమనించిన ఉపాధ్యాయుడు సరిగా కూర్చోవాలని, అల్లరి చేయవద్దని చెప్పారు.
దీనిపై ఆగ్రహించిన ఆ విద్యార్థి క్లాస్ అనంతరం ఇనుప రాడ్తో ఆ టీచర్పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఆ టీచర్ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. స్కూల్ యాజమాన్యం ఫిర్యాదుతో ఆ విద్యార్థిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.
కాగా, టీచర్పై దాడి చేసిన 21 ఏండ్ల విద్యార్థి లతిత్ 11వ తరగతి రెండుసార్లు ఫెయిల్ అయ్యాడని, మరోసారి ఆ తరగతి చదువుతున్నట్లు స్కూల్ అధికారులు వెల్లడించారు.