అమరావతి : ఏపీలోని విజయవాడలో గల హనుమాన్పేటలోని లాడ్జిలో ఓ యువకుడు మృతిచెందాడు. మృతుడిని యాదాద్రి జిల్లా వెలిగొండ మండలం ఆరూర్ నివాసి నాగరాజుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు.