మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.60 వేల నగదు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. శుక్రవారం టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో బెట్టింగ్ పాల్పడుతున్న వారి వివరాలను మీడియాకు వెల్లడించారు. హన్మంతునిగడ్డ ప్రాంతంలో వినియోగంలో లేని మదర్థెరిసా స్కూల్లో శుక్రవారం కొంతమంది బెట్టింగ్ చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
చేపల మార్కెట్ ప్రాంతానికి చెందిన బత్తిని ఉదయ్, బయ్య రాంప్రసాద్, శివాలయం వీధికి చెందిన మౌర్య శ్రీను, కుంట సాగర్, ఏనుగుతల ఉమేశ్, శ్రీనగర్కాలనీకి చెందిన కర్ణం సంప్రీత్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై గేమింగ్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : ఆడపిల్ల పుట్టిందని ఆటోలోనే వదిలి వెళ్లింది
ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్యం
హరితహారం చెట్టు నరికివేత..రూ.4,000 జరిమానా
సీఎం కేసీఆర్ కోలుకోవాలని మంత్రి పూజలు