వరంగల్ అర్బన్ : రెమ్డెసివిర్ ఇంజిక్షన్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న ఐదుగురు ముఠా సభ్యులను హన్మకొండ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల నుండి ఐదు రెమ్డెసివిర్ ఇంజక్షన్లతో పాటు రూ.24 వేలు స్వాధీనం చేసుకున్నారు. హన్మకొండ ఏసీపీ జితేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం జయ హాస్పిటల్ ముందు, హన్మకొండ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని పోలీసులు పట్టుకుని విచారించగా నేరం వెలుగులోకి వచ్చిందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో హన్మకొండ పీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్ఐలు రఘుపతి, నవీన్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, భాస్కర్, గౌస్ పాషా పాల్గొన్నారు.