రంగారెడ్డి : భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో గొంతు నులిమి చంపిన సంఘటన జిల్లాలోని షాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ ఆశోక్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..షాబాద్ మండల కేంద్రంలోని స్టేడియం వెనకాల ఓ కాలనీలో వడ్డే రమేష్, భార్య అనితతో కలిసి నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భార్య అనిత(28)కు అక్రమ సంబంధం ఉందని అనుమానంతో సోమవారం అర్దరాత్రి భర్త రమేష్ భార్యను గొంతు నులిమి చంపేశాడు.
మృతురాలి తల్లి వడ్డే సుగుణమ్మ మంగళవారం షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
సింగరేణిలో ఉద్యోగం పొందడం అదృష్టం
“బీఎమ్డబ్ల్యూ సీఈ04” ఫీచర్స్.. అదుర్స్..
అనుమానాస్పద స్థితిలో ట్రాక్టర్ మెకానిక్ మృతి
ట్రాక్టర్ పై నుంచి పడి డ్రైవర్ మృతి