న్యూఢిల్లీ, జూలై 10: డీమార్ట్ రిటైల్ చైన్ యాజమాన్య సంస్థ అయిన ఎవిన్యూ సూపర్మార్ట్స్ లాభం రెండింతలకుపైగా పెరిగింది. 2021 జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.95.36 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.40.08 కోట్లు. పలు రాష్ర్టాల్లో కఠినమైన లాక్డౌన్ ఆంక్షలు కొనసాగినప్పటికీ, డీమార్ట్ రూ.5,183 కోట్ల టర్నోవర్ సాధించింది. గతేడాది టర్నోవర్ రూ.3,883 కోట్లతో పోల్చితే ఈ జూన్ క్వార్టర్లో 31 శాతం వృద్ధి చెందింది. ఈ క్వార్టర్లో లాక్డౌన్లున్నా నిబంధనలు సరళంగా ఉండటం కలిసొచ్చింది.