లక్నో : యూపీలోని ఆగ్రాలో జ్యూవెలర్పై దోపిడీ దొంగలు పంజా విసిరారు. నగరంలోని బంగారు నగల వ్యాపారి గురువారం సాయంత్రం షాపు మూసివేసి ఇంటికి బయలుదేరగా జలేసర్ సబ్ డివిజనల్ కార్యాలయం వద్ద బైక్పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయనను అడ్డగించారు. వ్యాపారిపై దాడికి తెగబడిన దోపిడీ ముఠా ఆయన వద్ద నుంచి బంగారు ఆభరణాలతో పాటు రూ నాలుగు లక్షల నగదును దోచుకుని ఉడాయించారు.
బాధిత వ్యాపారిని సునీల్ కుమార్ (48)గా గుర్తించారు. దోపిడీ ముఠా తనను చుట్టుముట్టి షూట్ చేస్తామని బెదిరించి బ్యాగ్ను గుంజుకున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కుమార్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. షాపు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డీఎస్పీ సునీల్ కుమార్ త్యాగి తెలిపారు.