అనైతిక బంధం : సోదరిని కాల్చిచంపిన వ్యక్తి

లక్నో : ఉత్తర్ప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నెరపుతోందనే కోపంతో స్వయానా సోదరిని తలపై కాల్చి చంపిన వ్యక్తి ఉదంతం యూపీలోని మీరట్లో వెలుగుచూసింది. 24 గంటల్లో బాధితురాలి వివాహం జరగనుండగా ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. నగరంలోని లిసారి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్లామాబాద్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలికి మరో వ్యక్తితో వివాహం నిశ్చయం కావడంతో ప్రేమికుడు ఆమె అభ్యంతరకర ఫోటోలను ఆన్లైన్లో వైరల్ చేశాడు.
దీంతో కోపంతో రగిలిపోయిన బాధితురాలి సోదరుడు పెండ్లికి ముందే ఆమెను పొట్టనపెట్టుకున్నాడు. బాధితురాలు తన సోదరి మరిది ఖాసింతో నాలుగేళ్లుగా సన్నిహితంగా ఉంటోందని పోలీసులు వెల్లడించారు. ఆమెను వివాహం చేసుకునేందుకు ఖాసిం నిరాకరించాడని చెప్పారు. కాగా, సోదరిని హత్య చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశామని, నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.
తాజావార్తలు
- విజయ్ దేవరకొండకు హ్యాండ్ ఇస్తున్న స్టార్ డైరెక్టర్..?
- గాఢ నిద్రలో ఏనుగు పిల్ల.. తల్లి ఏనుగు ఏమి చేసిందంటే..
- టీచర్కు స్టూడెంట్ ఓదార్పు.. వైరల్ అవుతున్న లెటర్
- యువకుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య.!
- రామ్తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి
- పెట్రోల్ మంట: భారత విజ్ఞప్తిని పట్టించుకోని సౌదీ అరేబియా
- భృంగివాహనంపై ఊరేగిన ముక్కంటీశుడు
- జగన్కు విదేశీ జైలు తప్పదు : నారా లోకేశ్
- జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ తొలి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ