జయశంకర్ భూపాలపల్లి : జిల్లా కేంద్రంలోని గణేష్ చౌక్లో ఇసుక లారీ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. స్థానికుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాళేశ్వరం నుంచి ఇసుక లోడుతో వస్తున్న లారీ జిల్లా కేంద్రంలోని గణేష్ చౌక్ వద్ద మోటర్ సైకిల్ పై వస్తున్న వ్యక్తిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
విషయం తెలుసుకున్న భూపాలపల్లి పోలీసులు వెంటనే స్పందించారు. ఎస్ఐ అభినవ్ సంఘటన స్థలానికి చేరుకొని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఆక్సిజన్కు కొరత లేదు : మంత్రి జగదీష్ రెడ్డి
విషాదం : చెరువులోపడి యువకుడి మృతి
పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే మేయర్ ఎన్నిక
కరోనా నియంత్రణపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష
కరోనా బాధితులకు డ్రైఫ్రూట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే