హిమాయత్నగర్ : గుర్తు తెలియని ఓ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. అడ్మిన్ ఎస్సై డి.కరుణాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల నారాయణగూడ ట్రాఫిక్ పీఎస్ సమీపంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి (50) అపస్మారక స్థితిలో పడి ఉన్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అతన్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.
చికిత్స పొందుతున్న అతను శుక్రవారం మృతి చెందగా మృతదేహాన్ని మార్చురీలో భద్ర పర్చినట్లు తెలిపారు. మృతుడి బంధువులు , తెలిసినా వారు ఎవరైనా ఉంటే 040-27852579 నెంబర్ను సంప్రదించాలని సూచించారు.