బడంగ్పేట : చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకట్ రెడ్డి కథనం ప్రకారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆల్మాస్ గూడ పోచమ్మ కుంటలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి పడి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక నాయకుడు రామిడి సూర్ణ కర్ణారెడ్డి చెరువులో ఓ వ్యక్తి మృతి చెంది ఉన్న విషయాన్ని పోలీసులకు, స్థానిక మేయర్, కార్పొరేటర్స్ కు సమాచారం ఇచ్చారు.
మీర్పేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాడు రాజు సహయంతో మృతదేహాన్ని భయటకు తీసినట్లు వెంకట్ రెడ్డి తెలిపారు. మృతి చెందిన వ్యక్తి బ్లాక్ బ్లూకలర్ నైట్ పాయింట్, వైట్ ఫింక్ కలర్ షర్టు వేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, కార్పొరేటర్స్ ఏనుగు రాంరెడ్డి, ముత్యాల లలిత కృష్ణారెడ్డి తదితరులు చెరువు దగ్గర వచ్చారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.