మన్సూరాబాద్ : గుర్తు తెలియని ఓ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగోల్, జైపురికాలనీ సుజాత హోటల్ వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి (సుమారు 28 సంవత్సరాలు) అపస్మారకస్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గమనించి ఎల్బీనగర్ పోలీసులకు తెలియజేశారు.
సమాచారం మేరకు అక్కడి చేరుకున్న పోలీసులు 108 అంబులెన్స్ను రప్పించి సదరు వ్యక్తిని ఉస్మానియా దవాఖానకు తరలించారు. సదరు వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. సదరు వ్యక్తి ఎర్ర కలర్ ప్యాంటు, షర్టు ధరించి ఉన్నాడు.
ఎవరైనా సంబంధీకులు ఉంటే పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని పోలీసులు కోరారు. మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానలోని మార్చురీలో భద్రపరిచారు. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.