కాచిగూడ : అనారోగ్యంతో రైల్వేస్టేషన్ ప్లాట్ ఫారంపై ఓ వృద్ధుడు మృతి చెందాడు. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణాచారి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తుతెలియని వృద్ధుడు (60)ఆదివారం చందానగర్ రైల్వేస్టేషన్ చివర్లో దిమ్మపై అనారోగ్యంతో మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వేపోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుని ఒంటిపై ఎరుపురంగు చెక్స్గల లుంగీ, పసుపురంగు ఫుల్ షర్ట్ ధరించి ఎత్తు 5.5 ఉన్నట్లు తెలిపారు. కేసును కాచిగూడ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.