ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ బుధవారం గుండె పోటుతో హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిన్న రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు దవాఖానకు తీసుకొచ్చారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు రెఫర్ చేశారు. నగరంలోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం కాంబ్లే నాందేవ్ మృతి చెందారు.
ఇవి కూడా చదవండి..
Tokyo Olympics: టోక్యో ఫ్లైట్ మిస్ చేసుకున్న రెజ్లర్ వినేష్ పోగాట్
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత