నిర్మల్ : జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్వో కార్యాలయంలో పని చేసే సీనియర్ అసిస్టెంట్ ఓరుగంటి శ్రీనివాస్ రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిర్మల్ మండలం వెంగ్వాపేట్కు చెందిన రిటైర్డ్ ఎఫ్ఎస్ఓ రాజేశ్వర్ 2018 సంవత్సరంలో రిటైర్మెంట్ అయ్యారు.
అతనికి రావాల్సిన కమ్యూనిటీ డబ్బుల కోసం హెల్త్ డిపార్ట్మెంట్కు రిఫర్ చేశారు. అయితే డబ్బులు మంజూరు చేయడానికి సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ పదివేల రూపాయల డబ్బులను డిమాండ్ చేశారు. దీంతో రాజేశ్వర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
అన్లాక్ : 7 నుంచి స్కూల్స్, థియేటర్లు ఓపెన్
అదే ఆయన స్పెషల్..ఊరోళ్లతో ముచ్చటంటే సంబుర పడుతడు
Madhuri Dixit song : ఒలింపిక్స్లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?