హైదరాబాద్ : నగరంలోని అఫ్జల్గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. యాక్టివాపై వెళ్తున్న ఓ యువకుడిని హైదరాబాద్ -1 డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. శివాజీ బ్రిడ్జి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడిని ఉప్పుగూడకు చెందిన అవినాష్(31)గా పోలీసులు గుర్తించారు.