నేరేడుచర్ల : సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో దారుణం జరిగింది. ఓ యువతి గొంతు కోసి యువకుడు పరారీ అయ్యాడు. మండల కేంద్రంలోని అరవింద డిగ్రీ కాలేజ్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గంగిరెద్దుల కులానికి చెందిన కొందరు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే ఓ గుడిసెలోని బత్తుల బాలసైదులు (23).. వేరే గుడిసెలో ఉంటున్న సానికొమ్ము కల్యాణి (18) పై మనసు పారేసుకున్నాడు. తనను ప్రేమించాలని ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు.
అతని ప్రేమను ఆమె తిరస్కరించడంతో కోపంతో ఊగిపోయాడు. గురువారం ఉదయం కల్యాణి తన ఫ్రెండ్తో కలిసి బట్టలు ఉతికేందుకు సమీపంలో ఉన్న కాల్వ వద్దకు వెళ్లింది. అక్కడికి బాలసైదులు చేరుకుని.. కల్యాణి గొంతును బ్లేడ్తో కోసి పరారీ అయ్యాడు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో.. చికిత్స నిమిత్తం ఆమెను హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.