వెంగళరావునగర్, సెప్టెంబర్ 26: పెయింటర్ అదృశ్యమైన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం..రాజీవ్నగర్లో నివాసం ఉండే వై.చంటి (20) అనే యువకుడు రోజువారి కూలిగా పెయింటింగ్ పని చేస్తుండేవాడు. ఈనెల 3న రోజుమాదిరిగానే ఇంటినుండి పెయింటింగ్ పనికి వెళ్లిన చంటి తిరిగిరాలేదు.
దీంతో కుటుంబ సభ్యులు సమీప ప్రాంతాలు, తెలిసిన వారి వద్ద ఆరాతీశారు. అయినా ఫలితం లేకపోవడంతో తల్లి రాములమ్మ ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇతని ఆచూకి తెలిసిన వారు 8333900133 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.