మైలార్దేవ్పల్లి: అనుమాస్పద స్థితిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్
పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నర్సింహ తెలిపిన వివరాల ప్రకారం శివరాంపల్లి ప్రాంతానికి చెందిన ఆకుల సాయికుమార్ముదిరాజ్ (29) ఆటో ఓనర్ కం డ్రైవర్గా కాటేదాన్ పరిశ్రమలో ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. సోమవారం ఉదయం ఇంటి నుండి ఆటోతో బయలుదేరిన సాయి కుమార్ ముదిరాజ్ రాత్రయిన తిరిగి రాకపోవడంతో బంధువుల వద్ద ఆరాతీశారు. సమాచారం లేకపోవడంతో మృతుని సోదరుడు రాజేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు రంగంలోకి దిగి వెతకగా కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ఆర్కే ఫుడ్ పరిశ్రమ వెనుక నిర్మానుష్య ప్రాంతంలో ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మ హత్యకు పాల్పడ్డట్టు గుర్తించారు. మూడు నెలలుగా సాయికుమారు కడుపు నోప్పితో బాధపడుతున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించి ఏ ఎస్ ఐ రవిందర్రెడ్డి కేసును దర్యాప్తు చేస్తున్నారు.