మెట్పల్లి రూరల్, జూలై 2 : కడుపునొప్పి భరించలేక ఓ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. మెట్పల్లి ఎస్ఐ సదాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మెట్పల్లి మండలం చౌలమద్ది గ్రామానికి చెందిన గడ్డం వెంకట్రెడ్డి పదేళ్ల క్రితం తన కూతురు శిరీష (28)ను వికారాబాద్కు చెందిన ధనసిరి మల్లారెడ్డి కుమారుడు కిశోర్రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. ఎనిమిదేళ్ల నుంచి కిశోర్రెడ్డి-శిరీష మెట్పల్లి పట్టణంలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.
కాగా, శిరీషకు వివాహమైనప్పటి నుంచి కడుపునొప్పితో బాధపడుతుండేది. వైద్యులకు చూపించినా నయం కాకపోవడంతో మానసికంగా కుంగిపోయింది. దీంతో మెట్పల్లిలోని అద్దె ఇంట్లో భర్త లేని సమయంలో గురువారం సాయంత్రం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. తండ్రి వెంకట్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.