నల్లగొండ : పట్టపగలే ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు దుండగులు.. ధనలక్ష్మి(54) అనే మహిళపై అత్యాచారం చేసి చంపేశారు. అనంతరం మహిళను వివస్త్రను చేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను మాయం చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.