మహబూబ్నగర్ : నూతన కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణంలో భాగంగా మిగిలిపోయిన చిన్న చిన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన నూతన కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణాన్ని తనిఖీ చేశారు.
హెలీప్యాడ్ నిర్మాణం, అంతర్గత రహదారులు, ప్రహరీ నిర్మాణం,లిఫ్ట్ ఏర్పాటు, పార్కింగ్ టైల్స్, ల్యాండ్ స్కేప్, మొక్కలు నాటడం వంటి పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్వామిని ఆదేశించారు. అలాగే ఎలక్ట్రికల్ వివరాలు, లోడ్ వివరాలను సేకరించాలని చెప్పారు.
నూతన కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న ఎలక్ట్రికల్ గది, సర్వర్ గది, ఎన్ ఐ సి, కలెక్టర్ చాంబర్, ఇతర చాంబర్లు, సమావేశ మందిరాలు, టాయిలెట్స్ ఎలివేషన్, వాహన పార్కింగ్ నిర్మాణాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అవసరమైతే ఎక్కువ మంది కూలీలను వినియోగించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు.
కార్యాలయం ముందు ల్యాండ్ స్కేప్ లను అందంగా తీర్చిదిద్దాలని, అంతేకాక పెద్దపెద్ద మొక్కలను నాటాలని ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతా రామారావు ,ఆర్ అండ్ బీ ఈఈ స్వామి, డీఈ సంధ్య తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఘరానా దొంగను అరెస్ట్ చేసిన కోరుట్ల పోలీసులు
బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం : మంత్రి సత్యవతి
రైతులకు, హమాలీలకు ఉచిత అన్నదానం : ఎమ్మెల్సీ కవిత
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ను కలిసిన మంత్రి ఎర్రబెల్లి
పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం
టీఆర్ఎస్లోకి 50 మంది బీజేపీ నాయకులు