Crime
- Jan 08, 2021 , 12:14:34
శంషాబాద్లో మహిళ దారుణ హత్య

రంగారెడ్డి : శంషాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. విమానాశ్రయానికి వెళ్లేదారిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పూర్తిగా కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహం ఉందని పోలీసులు తెలిపారు. మహిళను రాత్రి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి వయసు 35 నుంచి 40 ఏండ్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహం లభించిన ఏరియాతో పాటు శంషాబాద్లో సీసీటీవీ కెమెరా దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
తాజావార్తలు
- రైతుల్లో చాలామంది వ్యవసాయ చట్టాలకు అనుకూలమే: కేంద్రం
- కాల్పుల్లో ఇద్దరు సుప్రీంకోర్టు మహిళా జడ్జీలు మృతి
- హ్యాట్సాఫ్.. శార్దూల్, సుందర్లపై కోహ్లి ప్రశంసలు
- మొన్నటి కిమ్ పరేడ్ జో బైడెన్కు హెచ్చరికనా..?!
- ఆసక్తికర విషయం చెప్పిన రామ్..!
- జర్మనీలో ఘనంగా సంక్రాంతి సంబురాలు
- ప్రభాస్ చిత్రానికి హీరోయిన్స్ టెన్షన్..!
- ముంబైలో అవినీతి సిబ్బంది పట్టివేత
- ప్రజలలో చైతన్యం పెరగాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
- గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి
MOST READ
TRENDING