నిజామాబాద్ : జిల్లాలోని రెంజల్ మండలం నీలా గ్రామంలో దారుణం జరిగింది. సంసారంలో గొడవలు చోటు చేసుకోవడంతో.. మొదటి భార్యపై భర్త కక్ష పెంచుకున్నాడు. రెండో భార్య ప్రోద్బలంతో మొదటి భార్యను సోమవారం రాత్రి కత్తితో పొడిచి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలిని మనుబాయి(45)గా, నిందితుడిని దావూజీగా గుర్తించారు పోలీసులు. మృతురాలి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.