ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ప్రాంత కష్టాలను ఆకలింపు చేసుకొన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. తన పాలనలో మానవీయకోణాన్ని మొదటి నుంచి ఆవిష్కరిస్తూనే ఉన్నారు. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ వినూత్న నిర్ణయాలతో మరోసారి గొప్పమనసు చాటుకున్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు బడ్జెట్లో రూ.6,465 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్తో పోలిస్తే 614 కోట్లు అదనం. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు 225 కోట్లు, నిఘా విభాగానికి 41.6 కోట్లు, ఆక్టోపస్కు 70.9 కోట్లు, అగ్నిమాపక శాఖకు రూ.75 కోట్లు కేటాయించారు.
ఐటీ రంగానికి రూ. 360 కోట్లు కేటాయించారు. ఇందులో ఐటీ, కమ్యూనికేషన్స్ కోసం 113 కోట్లు, మౌలిక సదుపాయాలకు 150 కోట్లు, వీ హబ్కు 7కోట్లు, స్టేట్ ఇన్నోవేషన్ సెల్కు 5 కోట్లు, టాస్క్కు 16 కోట్లు, సాఫ్ట్నెట్కు 16.5 కోట్లు, టీ-ఫండ్కు 15 కోట్లు కేటాయించారు.
సీఎం కేసీఆర్ స్వయంగా రైతు. రైతుల కష్టనష్టాలు-సాదక బాధకాలు ఆయనకు అనుభవమే. తెలంగాణ వ్యవసాయ పరిస్థితులపై ఆయన ఎంతో అధ్యయనం చేశారు. ఈ నేపథ్యం నుంచే రైతు బంధు, రైతు బీమా తరహా పథకాలు ప్రవేశపెట్టి రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచగలిగారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన వ్యవసాయ పథకాలకు ఐక్యరాజ్య సమితి నుంచి ప్రశంసలు రావడం మనకు గర్వకారణం. మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికి మార్గదర్శకంగా నిలిచాయి.
-బడ్జెట్ ప్రసంగంలో హరీశ్రావు